న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ ధోనీ గాయాన్ని దాచి ఇండియా ఆర్మీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా బంతి తగలడంతో ధోనీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని అప్పట్లో టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అనంతరం ధోనీ కూడా సాధారణంగానే ఇతర మ్యాచ్ల్లో ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో ధోనీ చేతి వేలికి ఫ్రాక్చర్అయిందని, ఆర్మీలో పని చేసేందుకు మహీ ఈ విషయాన్ని దాచిపెట్టాడని తెలుస్తోంది. టెరిటోరియల్ ఆర్మీ నిబంధనల ప్రకారం గాయపడ్డ వ్యక్తులను ట్రైనింగ్కు అనుమతించరనే అతను ఇలా చేశాడని సమాచారం.
