ఆర్మీ విధుల్లో చేరిన ధోనీ

ఆర్మీ విధుల్లో చేరిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంత విలక్షణమైన వ్యక్తో క్రికెట్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. తాను దేశ సేవ కోసం కల్లోలిత ప్రాంతమైన కశ్మీర్ లోయలో కాలు మోపాడు. ఇవాళ్టి(బుధవారం) నుంచి అక్కడ ధోనీ సైన్యం దుస్తుల్లో డ్యూటీ చేయనున్నాడు.

ధోనీ ఆర్మీ అనుబంధ పారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ కూడా. తన ఉద్యోగానికి న్యాయం చేసేందుకు ధోనీ రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, విధుల్లో చేరిన ధోనీకి ఆర్మీ అధికారులు గార్డు డ్యూటీ కేటాయించారు. పెట్రోలింగ్ విధులతో పాటు, అవుట్ పోస్టు డ్యూటీ కూడా ధోనీ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ‘విక్టర్ ఫోర్స్’ కమెండోలతో కలిసి 15 రోజుల పాటు వివిధ రకాల శిక్షణలు పొందనున్నాడు.