![ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం](https://static.v6velugu.com/uploads/2021/12/Mukesh-Ambani-talks-of-leadership-transition-at-Reliance_NJLlU04w96.jpg)
ముంబై: రిలయన్స్ పగ్గాలను తర్వాత తరాలకు అప్పచెప్పడానికి రెడీ అవుతున్నట్లు చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా వర్చువల్ కాన్ఫరెన్స్లో మంగళవారం ముకేశ్ అంబానీ మాట్లాడారు. తనతో సహా గ్రూప్లోని సీనియర్లందరూ యంగ్ లీడర్షిప్కు అధికార బదలాయింపునకు సిద్ధపడాల్సిందేనని అన్నారు. ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువతరాన్ని గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేసే బాధ్యత మాత్రమే అట్టేపెట్టుకుని, వారు పెర్ఫార్మ్ చేస్తుంటే చూసి మెచ్చుకోవాలని పేర్కొన్నారు. లీడర్లను మించిపోయేలా ఆర్గనైజేషనల్ కల్చర్ను రిలయన్స్లో తీర్చిదిద్దాలని అంబానీ తెలిపారు. తన పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్లు రిలయన్స్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తారనే నమ్మకాన్ని ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన తండ్రిలో కనిపించిన సామర్ధ్యం ఇప్పుడు తన పిల్లలలో కనిపిస్తోందని, రిలయన్స్ను మరింత సక్సెస్ఫుల్గా చేసే వారి మిషన్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు. గతంలో సాధించిన దానితో ఎప్పుడూ సంతృప్తి పడిపోకూడదని పేర్కొన్నారు.