- మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు
ముంబై: కొన్ని వేల కోట్ల రూపాయిల విలువైన ధారావి స్లమ్ (ముంబై) రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా అదానీ గ్రూప్కు ఎటువంటి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాదని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ల్యాండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ అవుతుందని అన్నారు. డెవలపర్గా అదానీ గ్రూప్ ధారావిలో ఇండ్లు నిర్మిస్తుందని, అక్కడి రెసిడెంట్లకు వీటిని అలాట్ చేసే ముందు సంబంధిత డిపార్ట్మెంట్కు హ్యాండోవర్ చేస్తుందని వివరించారు.
అదానీ గ్రూప్ ధారావి భూములను దోచుకోవాలని చూస్తోందని ఎంపీ వర్ష గైక్వాడ్ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించారు. ధారావి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ను ఓపెన్ ఇంటర్నేషన్ బిడ్డింగ్లో గెలుచుకున్న అదానీ గ్రూప్, ఇక్కడ ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లను ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్మించనుంది.