Reliance: ఆ వ్యాపారంపై రూ.8వేల కోట్లు కుమ్మరిస్తున్న అంబానీ.. పీక్స్‌కి పోటీ..

Reliance: ఆ వ్యాపారంపై రూ.8వేల కోట్లు కుమ్మరిస్తున్న అంబానీ.. పీక్స్‌కి పోటీ..

Mukesh Ambani: దేశంలోనే కాక ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపావేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఏదైనా వ్యాపారంలోకి అడుగుపెట్టాడంటే తన వ్యూహాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. టెలికాం నుంచి బెవరేజెస్ వరకు అన్ని రంగాల్లో ఆయన ప్రయాణాన్ని చూస్తే మనకు ఈ విషయం అర్థం అవుతుంది. 

రిలయన్స్ కన్జూమర్ ప్రొజక్ట్స్ కింద ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్. అయితే రానున్న 12 నుంచి 15 నెలల కాలంలో రిలయన్స్ తన శీతల పానీయాల వ్యాపారాన్ని విస్తరించేందుకు దాదాపు రూ.8వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా కొత్తగా 12 ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్లు, కో ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలు కోకాకోలా, పెప్సికో వంటి విదేశీ కంపెనీలకు భారత మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వగలదని రిలయన్స్ భావిస్తోంది. 

Also Read : స్టాక్ మార్కెట్లలో డబ్బు సంపాదించాలని ఉందా..? 

కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో గౌహతిలో జెరిచో ఫుడ్స్ అండ్ బెవరేజెస్ సంస్థతో ఉత్పత్తి కోసం జతకట్టింది, అలాగే బీహార్ లో మరో ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది. ఇదే తరహాలో భాగస్వామ్యాల ద్వారా ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాని రిలయన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత ఎఫ్ఎంసీజీ రంగంలో శీతలపానీయాలపై రిలయన్స్ భారీగా బెచ్ వేస్తోంది. క్యాంపా కోలా బ్రాండ్ కొనుగోలు తర్వాత దానిని వేగంగా విస్తరించేందుకు అంబానీ ప్రయత్నిస్తున్నారు. సరసమైన ధరలకు శీతలపానీయాలను మార్కెట్లోకి కంపెనీ విడుదల చేయటం పెద్ద పోటీని ప్రేరేపించింది.

ప్రస్తుతం శీతలపానీయాల వ్యాపారం కింద రిలయన్స్ క్యాంపా కోలా, సోస్యో, స్పిన్నర్, రస్కిక్, ఇండిపెండెన్స్ బ్రాండ్ల కింద వివిధ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ 18 పానీయ ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. విదేశాలకు కూడా క్యాంపా ఉత్పత్తులను విస్తరించిన రిలయన్స్, శ్రీలంకలో ముత్తయ్య మురళీదరన్ తో జతకట్టి స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్ ను రూ.10కి విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే అనేక అరబ్ దేశాలకు సైతం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 

2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ శీతలపానీయం క్యాంపా కోలా రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేయగా.. ఇండిపెండెన్స్ కూడా రూ.వెయ్యి కోట్ల రెనెన్యూ జనరేట్ చేసింది. దేశంలో ముందుగానే వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది పీక్ సమ్మర్ సేల్స్ ని దెబ్బతీశాయి.