అదానీ వర్సెస్​ అంబానీ

అదానీ వర్సెస్​ అంబానీ

టెలికాం వ్యాపారం కోసం అదానీ గ్రూప్ తన పూర్తి స్థాయి ప్రణాళికను ఇంకా వెల్లడించ నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబా టులోకి తేవడానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో 5జీ సేవలను మొదలు పెట్టారు. భారతీయ బిలియనీర్లు ముఖేష్ అంబానీ,  గౌతమ్ అదానీ 2022 సంవత్స రంలో  5జీ టెలికాం సేవల కోసం స్పెక్ట్రమ్​ వేలంలో పాల్గొన్నారు.

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్​కు చెందిన  అదానీ డేటా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ లిమిటెడ్ (ఏడీఎన్​ఎస్​) స్పెక్ట్రమ్ వేలంలో 20 సంవత్సరాల పాటు వాడుకోవడానికి రూ.212 కోట్ల విలువైన 26గిగాహెజ్​ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 400మెగాహెజ్​ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకునే హక్కును పొందింది. ఒకేవ్యాపారం కోసం ఈ రెండు గ్రూపులు పోటీపడటం ఇదే మొదటిసారి.