అంబులెన్స్ లో వచ్చి ఓటు వేసిన ముఖేష్ గౌడ్

అంబులెన్స్ లో వచ్చి ఓటు వేసిన ముఖేష్ గౌడ్

హైదరాబాద్ : తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  తీవ్ర అనారోగ్యం పాలైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అబిడ్స్ లో  ఓటు వేశారు.   ఆయన కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో అబిడ్స్ జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి ఓటు వేయించారు.