వనదేవతలను దర్శించుకున్న అధికారులు

వనదేవతలను దర్శించుకున్న అధికారులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంగళవారం ములుగు  అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ దర్శించుకున్నారు.  ఇటీవల  అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు పూజారులు  స్వాగతం పలికి,  సత్కరించారు.   కొబ్బరికాయలు కొట్టి గద్దెల వద్ద  పసుపు కుంకుమ శిరసారే పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   ఆయన వెంట తహసీల్దార్ తోట రవీందర్ ఉన్నారు.