ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి ముంబై ముస్తాబైంది. ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ వద్ద సందడి నెలకొంది. ఇప్పటికే వందలాది మంది శివసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. శివసేన నుంచి మహారాష్ట్ర సీఎం ఉండాలన్న బాలాసాహెబ్ థాక్రే కల నిజం కాబోతుందంటూ పోస్టర్లు వెలిశాయి. ఇందిరాగాంధీతో బాల్ థాక్రే కలిసి ఉన్న పోస్టర్లు సేన భవన్ దగ్గర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీఎంగా ప్రమాణం చేయనున్న ఉద్ధవ్ కు విషెష్ చెబుతూ నగరమంతా పోస్టర్లు వెలిశాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ జెండాలను కలిపి ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్, శరద్ పవార్, బాల్ థాక్రే ఫోటోలతో కూడిన పోస్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మహారాష్ట్ర 1 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఉద్ధవ్.. థాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వంలో పదవి చేపట్టిన మొదటి నేతగా నిలవబోతున్నారు. శివసేన నుంచి మూడవ ముఖ్యమంత్రి గా ఆయన ఘనత సాధించనున్నారు. గతంలో శివసేన తరపున మనోహర్ లాల్ జోషి 1996లో , నారాయణ రాణే 1999లో ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం జరగనున్న శివాజ్ పార్క్ దగ్గర 2వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mumbai: Hoardings welcoming the new government in #Maharashtra and party flags of Shiv Sena & Congress seen on the stretch from Dadar TT to Shivaji Park. The new state govt, led by Shiv Sena chief & 'Maha Vikas Aghadi' leader Uddhav Thackeray as the CM, will be sworn in today. pic.twitter.com/aegYvgxmbK
— ANI (@ANI) November 28, 2019