ముంబైలో ఐరన్ బ్రిడ్జి చోరీ.. 6 వేల కిలోల వంతెనను కట్​ చేసి తీసుకెళ్లిన దొంగలు

ముంబైలో ఐరన్ బ్రిడ్జి చోరీ.. 6 వేల కిలోల వంతెనను కట్​ చేసి తీసుకెళ్లిన దొంగలు

ముంబై: ముంబైలో 90 అడుగుల ఇనుప వంతెన మాయమైంది. డ్రైన్​పై నిర్మించిన 6 వేల కిలోల ఇనుప వంతెన చోరీకి గురైందని అధికారులు  శనివారం తెలిపారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా, మలాడ్​లో నిర్మిస్తున్న మెటల్​కట్టడంకోసం భారీ పవర్ ​కేబుల్స్ తరలించడానికి ఈ ఇనుప వంతెనను తాత్కాలికంగా నిర్మించారు. ఆపై పర్మనెంట్ బ్రిడ్జి నిర్మించి తాత్కాలిక వంతెనను మరో ప్రాంతానికి తరలించారు. కొన్నినెలల క్రితం ఈ ఘటన జరిగింది. జూన్ 26న బ్రిడ్జి మాయమైనట్లు కనస్ట్రక్షన్​ కంపెనీ గుర్తించింది. దీనిపై ఫిర్యాదు​చేయడంతో పోలీసు లు దర్యాప్తు ప్రారంభించారు.

జూన్​ 6న ఇనుప వంతెనను చివరిసారి చూసినట్లు దర్యాప్తులో పోలీసులకు కొంతమంది వెల్లడించారు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూన్​ 11న భారీ వాహనం ఒకటి వంతెన దిశగా వెళ్లినట్లు గుర్తించారు. బ​ నంబర్​ సాయంతో వాహన వివారాలను పోలీసులు కనుగొన్నారు. గ్యాస్​ కట్టింగ్​ మెషిన్లను ఉపయోగించి 90 అడుగుల వంతెనను కట్​ చేశారని దర్యాప్తులో తేలింది. 6వేల కిలోల బరువు ఉన్న ఐరన్​ను దొంగిలించి భారీ వాహనంలో తరలించారని అధికారులు వివరించారు. బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్ట్​ ఇచ్చిన సంస్థ ఉద్యోగి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో  కనుగొన్నారు.