స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని ఓ ఉపాధ్యాయురాలు మృతిచెందిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. మలాడ్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న జెనెల్ ఫెర్నాండెజ్ (26 ).. ఆరో అంతస్తులో క్లాస్ చెప్పిన తర్వాత రెండో ఫ్లోర్లోని స్టాఫ్ రూమ్కు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చింది. లిఫ్ట్లో ఆమె ఒక కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది.
దీంతో లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉన్న ఆమె గోడ మధ్యలో చిక్కుకుంది. సహాయం కోసం ఆమె కేకలు వేయగా.. పాఠశాల సిబ్బంది, పిల్లలు ఆమెకు హెల్ప్ చేయడానికి వచ్చారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో ఉపాధ్యాయురాలు ప్రమాదవశాత్తు మరణించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.