వెలుగు ఎఫెక్ట్ మున్సిపల్​ కమిషనర్ తన్నీరు​ రమేశ్ ​సస్పెండ్

వెలుగు ఎఫెక్ట్ మున్సిపల్​ కమిషనర్ తన్నీరు​ రమేశ్ ​సస్పెండ్

మంచిర్యాల, వెలుగు: నస్పూర్​మున్సిపల్​కమిషనర్​గా పనిచేసిన తన్నీరు రమేశ్​సస్పెండయ్యారు. అక్రమంగా బిల్డింగ్​​పర్మిషన్లు జారీ చేసినందుకు ఆయనను సస్పెండ్​చేస్తూ మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​ జాయింట్​డైరెక్టర్​మంగళవారం ఆర్డర్స్​జారీ చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కమిషనర్​గా పనిచేస్తున్న రమేశ్.. అంతకుముందు నస్పూర్ లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు మెడికల్​ లీవ్​పై వెళ్లారు. లీవ్​లో ఉండగానే 13న చేర్యాలకు ట్రాన్స్​ఫర్​అయ్యారు. కానీ 14న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల మధ్య హడావుడిగా 9 బిల్డింగ్ లకు పర్మిషన్లు జారీ చేశారు. 

ఈ విషయాన్ని ‘వెలుగు’ పేపర్​బయటపెట్టింది. ‘అర్ధరాత్రి హౌస్​పర్మిషన్లు’ పేరుతో ఫిబ్రవరి 18న స్టోరీ పబ్లిష్​ చేసింది. దీనిపై స్పందించిన మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వరంగల్ రీజినల్​ డైరెక్టర్ వచ్చి​ఎంక్వయిరీ జరిపారు. 9 బిల్డింగ్​పర్మిషన్లలో రెండింటిని టీపీఎస్​ రికమండ్​చేయకుండానే కమిషనర్ రమేశ్ అప్రూవ్​చేసినట్టు గుర్తించారు. అలాగే కలెక్టర్​సంతోష్​మంచిర్యాల ఆర్డీఓతో ఎంక్వయిరీ జరిపించి రిపోర్ట్​సమర్పించారు. ఈ మేరకు రమేశ్​అక్రమంగా బిల్డింగ్​పర్మిషన్లు ఇచ్చినట్టు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్​ చేశారు.