11 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్లు

11 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్లు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న 11 మంది స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి జీవో జారీ చేశారు. వీరిలో ఇద్దరు సీడీఎంఏ ( కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్) కార్యాలయంలో పనిచేస్తుండగా, మిగతా 9 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. వీరంతా పాత ప్లేస్ ల్లోనే కొనసాగాలని ఉత్తర్వుల్లో సెక్రటరీ పేర్కొన్నారు.