బీజేపీ రాముడితోనే ఉంటుంది: మురళీ ధర్ రావు

బీజేపీ రాముడితోనే  ఉంటుంది: మురళీ ధర్ రావు

దేశంలో మోదీ పాలన రావడం ఖాయమన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావు. రాముడుంటేనే దేశం ఉంటుందిని.. రాముడితోనే బీజేపీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ రాముడిని వదిలేసినందుకే బీజేపీ రాముని నినాదాం ఎత్తుకుందన్నారు. 

మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీ గెలవడంతోపాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటామన్నారు మురళీధర్ రావు. దేశంలో పౌరులంతా తమ, తమ మాతృబాషను మరచిపోవద్దన్నారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో నిర్వహించిన తెలంగాణ మలయాళీ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో మురళీధర రావు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మలయాళీలు పాత్ర ఎంతగానో ఉందని తెలిపారు.