హత్య కేసులపై కమిషనర్, డీజీపీ సీరియస్

హత్య కేసులపై కమిషనర్, డీజీపీ సీరియస్

హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను డీజీపీ మహేందర్ రెడ్డి , కమిషనర్ అంజనీ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు డీజీపీ. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసుల నేపథ్యంలో సిబ్బందిపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫిర్యాదుదారులతో గౌరవంగా, వారికి జవాబుదారీగా ఉండి నిబద్ధతతో డ్యూటీ చేయాలని సూచించారు.