- మృతుడు గుంటూరు జిల్లా వాసి
వాషింగ్టన్: అమెరికాలోని బోస్టన్లో ఇండియన్ స్టూడెంట్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మృతుడిని ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ (20)గా గుర్తించారు. బోస్టన్ వర్సిటీలో అభిజిత్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఓ అడవిలో కారులో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. డబ్బు, ల్యాప్టాప్ కోసం దండుగులు అతన్ని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తు న్నారు.
వర్సిటీలో ఇతర విద్యార్థులతో అతనికి గొడవ జరిగింది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అమెరికాలోని లాంచనాలన్నీ పూర్తయ్యాక అభిజిత్ డెడ్బాడీని బుర్రిపాలెంకు తరలించారు.