సనత్ నగర్ లో వ్యక్తి హత్య.. భరత్ నగర్ వంతెన సమీపంలో ఘటన

సనత్ నగర్ లో వ్యక్తి హత్య.. భరత్ నగర్ వంతెన సమీపంలో ఘటన

పంజాగుట్ట, వెలుగు: సనత్‌నగర్  పోలీస్ స్టేషన్  పరిధిలో బుధవారం ఒక వ్యక్తిని హత్య చేశారు. సనత్​నగర్​ ఇన్స్​పెక్టర్​ అశోక్​ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన శంకర్(48)ని బుధవారం ఉదయం  భరత్ నగర్  వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. మృతుడు రెండేళ్లుగా మూసాపేటలోని ఒక హోటల్‌లో హెడ్ ​కుక్​గా పని చేస్తున్నాడు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు ఇన్​స్పెక్టర్​ తెలిపారు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి  తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.