నా కూతుర్ని చంపింది అల్లుడే: మంజుల

నా కూతుర్ని చంపింది అల్లుడే: మంజుల

జగిత్యాల జిల్లా: తన అల్లుడి వేధింపులతో తన కూతురు మృతి చెందిందంటూ కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన రుచిత తల్లి మంజుల. ఏడాది క్రితం పెళ్లి చేసినప్పుడు కొద్ది రోజులు మాత్రమే తన కూతురుతో సఖ్యతగా ఉన్నాడని.. తర్వాత నుంచి వేధింపులకు గురిచేసేవాడని మృతురాలి తల్లి మంజుల ఆరోపించింది. సర్దుకుంటుందిలో అని ఆశిస్తున్న తరుణంలో రుచిత తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు కావడం తమను షాక్ కు గురిచేసిందని.. కోలుకున్నాకైనా కాపురం సర్దుబాటు చేద్దామనుకుంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని మంజుల కంటతడిపెట్టుకుంది.

కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రుచిత చికిత్స ఫలించక ఇవాళ గురువారం తుదిశ్వాస విడవడంతో ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున రోదించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విలవిలలాడుతున్న కూతుర్ని బోరున విలపించారు. వారి బాధను చూసిన వారంతా చలించిపోయారు.తల్లి ఫిర్యాదు మేరకు కోరుట్ల మండలంలోని ఎకీన్ పూర్ గ్రామానికి చెందిన జాల మనోజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రుచిత-మనోజ్ లకు ఏడాది క్రితమే పెళ్లయింది. మూడ్రోజుల క్రితం అంటే గత నెల 30వ తేదీన కుటుంబ కలహాలతో భార్య రుచితను తీవ్రంగా మనోజ్ కొట్టడంతో.. కరీంనగర్  ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక ఇవాళ రుచిత మృతి చెందింది.