నర్సాపూర్ మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్

నర్సాపూర్ మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్

నర్సాపూర్,వెలుగు  : నర్సాపూర్ మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్​సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ కు చెందిన 9 మంది కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ రమేశ్ ను కలిసి అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్,  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్ అవిశ్వాసానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు.

కలెక్టర్​ రాజీనామాను ఆమోదించడంతో వైస్ చైర్మన్ గా ఉన్న నయీమొద్దీన్​ ఇన్‌చార్జి చైర్మన్ గా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్ వైస్ చైర్మన్ గా ఉన్న నయీమొద్దీన్​కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కౌన్సిలర్లు, స్థానిక నాయకులు ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించగా మాజీ చైర్మన్ మురళీ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.