వర్షంలో తడుస్తూ.. అభిమానులను కలుస్తూ

వర్షంలో తడుస్తూ.. అభిమానులను కలుస్తూ

టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో ఒకరైన ‘నాగశౌర్య’ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘కృష్ణ వ్రింద విహారి’ లో హీరోగా నటిస్తు్న్నాడు. సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో.. సినిమా ప్రమోషన్స్ ను ‘నాగశౌర్య’ వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. తిరుపతికి చేరుకున్న ఆయన అలిపిరి మెట్టు నుంచి ఎన్టార్ సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టారు. అభిమానులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగడమే కాకుండా.. చిన్నారులతో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు.

తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీ పడ్డారు. వర్షం పడినా.. పాదయాత్రను ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను BA Raju's Team ట్వీట్ చేసింది. నాగశౌర్య హోం బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మల్పూరి నిర్మించారు. నాగశౌర్య తరపున షిర్లే సేథియా హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’, ’లక్ష్య’ అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం  ‘కృష్ణ వ్రింద విహారి’పై ఆశలు పెట్టుకున్నారు.