ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేయండి :స్పెషల్​ ఆఫీసర్​ రవినాయక్

ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేయండి :స్పెషల్​ ఆఫీసర్​ రవినాయక్
  • పాలమూరు, కల్వకుర్తి, డిండి భూ సేకరణ రివ్యూ 

నాగర్​ కర్నూల్, వెలుగు:  పాలమూరు -రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల పథకాలు,అచ్చంపేట,మార్కండేయ లిఫ్టులకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్​ స్పెషల్​ ఆఫీసర్​ రవినాయక్​, కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ఆదేశించారు. గురువారం నాగర్​ కర్నూల్​కలెక్టరేట్‌‌‌‌లో  రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్​ సర్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  సాగు నీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సీరియస్​గా ఉందన్నారు.  ప్రధాన ప్రాజెక్టులలో ప్యాకేజీల వారీగా జరుగుతున్న పనులను ఇంజనీరింగ్​అధికారులను అడిగారు.  

భూ సేకరణలో సమస్యలు వస్తున్న ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు పర్యటించి రైతుల సందేహాలను తీర్చాలన్నారు.   కల్వకుర్తి లిఫ్ట్​లోని 30వ ప్యాకేజీలో 598 ఎకరాలకు గాను 319 ఎకరాలకు సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించామన్నారు.  279 ఎకరాల భూ సేకరణ వివిధ నోటిఫికేషన్, అవార్డు దశలలో ఉంది. హాజీపూర్, నడింపల్లి, చంద్రాపూర్​ ఏరియాలకు నీరు వెళ్లేందుకు అవసరమైన 54  ఎకరాలు సర్వే దశలో ఉందన్నారు. అడిషనల్​ కలెక్టర్ అమరేందర్​, ఇరిగేషన్​ సీఈ విజయ్ భాస్కర్, ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి. ఈఈ శ్రీకాంత్, మురళి, ఆర్డిఓలు మాధవి, బన్సీలాల్, సురేశ్, శ్రీనివాస్​, సర్వే అధికారి సరిత, తహసీల్దార్లు  పాల్గొన్నారు.