కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
  •     వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
  •     కాంగ్రెస్​లో ఉండి ఇతర గుర్తుపై పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులపై సస్పెన్షన్​వేటు

పెబ్బేరు, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ​ ప్రజలకు కొత్త రేషన్​ కార్డులు ఇచ్చిందని, అందులో వనపర్తి నియోజకవర్గానికి 32 వేల కార్డులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్​ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో డీసీసీ ప్రెసిడెంట్​శివసేనా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్​ కాలనీలోని కర్రెమ్మ గుడి నుంచి వనపర్తి రోడ్​ మీదుగా సుభాష్​ చౌరస్తా, అంబేద్కర్​ చౌరస్తా వరకు వెళ్లి సుభాష్​ చౌక్​కు చేరుకొని కార్నర్​ మీటింగులో మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పారు.

12 వార్డుల్లోనూ కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే, వెంటనే వార్డుకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​శివసేనారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​పార్టీలో ఉండి వాళ్లకు చెప్పినా తీరు మార్చుకోనందున గౌని బుచ్చా రెడ్డి, జయశ్రీ, సురేశ్​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించారు.