ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :  మంత్రి జూపల్లి
  •     మంత్రి జూపల్లి

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని  మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి మేకల కిషోర్ యాదవ్, 13వ వార్డు అభ్యర్థి  వంగ అనూషను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడే ఏలాంటి అభివృద్ధి చేయలేని బీఆర్​ఎస్​ నాయకులు, ఇప్పుడు అధికారం లేకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.