బరిలో రవినాయక్ కాదు గిరిజనులే

బరిలో రవినాయక్ కాదు గిరిజనులే

సాగర్ లో రవి నాయక్ నిలబెడితే.. గెలుస్తాడని నమ్మే బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ .గిరిజనులకు బీజేపీ పెద్దపీట వేసిందన్నారు. బరిలో రవి నాయక్ లేడని.. గిరిజనులే వున్నారనుకోవాలన్నారు. దుబ్బాకలో కూడా బీజేపీ ఓడిపోతుందన్నారు...కానీ రఘునందన్ రావును బరిలో పెట్టి ..దుబ్బాక లో బీజేపీ జెండా ఎగరవేసిందన్నారు.  దుబ్బాక తరహాలోనే సాగర్ లో కూడా ఓట్లను కొనడానికి డబ్బు సంచులు వస్తున్నాయన్నారు.  జానారెడ్డి కేసీఆర్ దోస్తని..ఆయనను గెలిపించడానికే భగత్ కు టికెట్ ఇచ్చారన్నారు. బీజేపీకి టీఆరెస్ పోటీ కాదని.. జానారెడ్డే పోటీ అని అన్నారు. టీఆరెస్, కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తుందన్నారు. జానారెడ్డిని చిత్తుగా ఓడించేలా గిరిజనులు పనిచేయాలన్నారు.