హైదరాబాద్లో ఆగిన మెట్రో.. ప్రయాణికుల ఇబ్బందులు

హైదరాబాద్లో ఆగిన మెట్రో.. ప్రయాణికుల ఇబ్బందులు

 హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల వల్ల చాలా మంది టైం సేఫ్ కోసం..త్వరగా వెళ్లేందుకు చాలా మంది మెట్రోల వెళ్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసేవాళ్లు చాలా మంది మెట్రోల ప్రయాణం చేస్తారు. అయితే అపుడపుడు సాంకేతిక లోపంతో మెట్రో రైళ్లు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు  ఇబ్బందిపడుతన్నారు.

హైదరాబాద్ లో  మెట్రో రైలు ఆగిపోయింది.   నాగోల్ నుంచి  మియాపూర్  వెళ్తున్న   మెట్రో రైలు  జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గరకు రాగానే  నిలిచిపోయింది.  సాంకేతిక లోపంతో దాదాపు 15 నిమిషాలు ఆగిపోయింది. దీంతో మిగతా రైళ్లను నిలిపి వేశారు.  దీంతో  ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  మళ్లీ15 నిమిషాల తర్వాత మెట్రో రైలు తిరిగి ప్రారంభమయ్యింది.