కాంగ్రెస్​లో చేరిన నాగపురి కిరణ్​ కుమార్​గౌడ్

కాంగ్రెస్​లో చేరిన నాగపురి కిరణ్​ కుమార్​గౌడ్

చేర్యాల,వెలుగు: ఇటీవల బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్​కుమార్​గౌడ్​ సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో​చేరారు. మంగళవారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్​గౌడ్​ఆధ్వర్యంలో కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లడుతూ.. భువనగిరి పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.

 కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్​, నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి  జీవ​న్​రెడ్డి, మైనింగ్​ కార్పొరేషన్​ చైర్మన్​అనిల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశం, మహేందర్​రెడ్డి ఉన్నారు.