అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఎస్పీ అపూర్వ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని  బైపాస్​వెంట ఉన్న ఇండ్లను టార్గెట్​ చేసిన ఇద్దరు తరచూ చోరీలకు పాల్పడుతున్నారు. 

బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను మిర్యాలగూడలో పట్టుకున్నారు. వారు ఇప్పటివరకు 20 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. 

ALSO READ : మోదీ తర్వాత యోగీనే పీఎం ..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

వారి నుంఇచ రూ.60 లక్షల విలువైన 83 తులాల బంగారం, 8 తులాల వెండి, ఒక బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిర్యాలగూడలో ఏస్పీ 36 సీసీ కెమెరాలను ప్రారంభించారు.