న్యూసెన్స్ కేసులో ఏడుగురికి జైలు శిక్ష

న్యూసెన్స్ కేసులో ఏడుగురికి జైలు శిక్ష

మెహిదీపట్నం/ముషీరాబాద్, వెలుగు: మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్న  ఓ వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఇన్ స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకరాం.. ముషీరాబాద్ కు చెందిన మహ్మద్ నసీరుద్దీన్(25) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. 

ఆదివారం రాత్రి బస్టాండ్ లో మద్యం తాగి న్యూసెన్స్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని 11వ స్పెషల్ ఎంఎం కోర్టులో హాజరుపరిచారు. నసీరుద్దీన్ కు 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అదే విధంగా మద్యం తాగి న్యూసెన్స్ చేసిన మరో కేసులో ఆరుగురికి ఐదు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ సికింద్రాబాద్ లోని 13వ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పునిచ్చింది.