హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష విధించింది. 2019లో భవానీ నగర్ పీఎస్ పరిధిలో అదనపు కట్నం కోసం భర్త ఇమ్రాన్ ఉల్ హక్ అతని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ మేరకు భవాని నగర్ పోలీస్ స్టేషన్ లో 2019లో U/s 302 IPC 498 (A) కింద కేసు నమోదు చేశారు.
అదనపు కట్నం కోసమే తన భార్యను ఇమ్రాన్ చంపినట్లు తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇవాళ నిందితుడికి ఉరిశిక్షతో పాటు 10 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది.