
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్భందం నేపథ్యంలో నారా లోకేష్ను పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు. చినకాకాని రహదారి దిగ్భందానికి బయలుదేరిన నారా లోకేష్ను బెంజ్ సర్కిల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను యనమలకుదురు పోలీస్స్టేషన్కి తరలించారు. అయితే లోకేష్ అరెస్టును టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. లోకేష్తో పాటు కొల్లు రవీంద్ర, రామానాయుడులను కూడా అరెస్టు చేశారు.