
జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని..రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. జేసీ ప్రబాకర్ రెడ్డి బెయిల్ పై రిలీజ్ అయిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్ట్ చేశారన్నారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం భాదాకరమన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి జగన్ నేర మనస్తత్వమే కారణమన్నారు. ఆయనను తక్షణమే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. జేసీ ప్రభాకర్ త్వరగా కోలుకోవాలని దేవుడని ప్రార్థిస్తున్నట్లు కోరారు లోకేశ్.
జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం. తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 19, 2020