గురువారం ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఘాటైన సంభాషణ జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అప్పటి సీఎం గా ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ లో స్పందిస్తూ.. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని సీఎం జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు.ఎందుకంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో అని లోకేశ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
అలాగే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూడవచ్చు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, ఇలాంటివి చూసే టైం ఉండి ఉండదు. pic.twitter.com/nv1e9DtRx4
— Lokesh Nara (@naralokesh) July 11, 2019