దేశమంతా ఇవాళ పండుగ చేసుకుంటోంది : మోడీ

దేశమంతా ఇవాళ పండుగ చేసుకుంటోంది : మోడీ

రాజస్థాన్ : పాక్ ఉగ్రవాదులపై భారత వైమానిక దళం దాడి చేసిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. దేశమంతా ఇవాళ పండుగ చేసుకుంటోందన్నారు. దేశమంతా అప్రమత్తంగా ఉందన్న మోడీ విజయం మనదే అన్నారు. దేశ ప్రజలు సురక్షితుల చేతుల్లో ఉందని తెలిపారు. మెరుపు దాడుల వీరులకు తలవంచి నమస్కారం చేద్దాం అన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే వారికి నా వందనం అన్నారు. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా జీతీయ స్మారక స్థూపం నిర్మించామని..సైనికుల కోసం వన్ ర్యాంక్ పెన్షన్ పాలసీ తెచ్చామన్నారు. దేశ రక్షణ కోసం వేలాది మంది సైనికులు కష్టపడుతున్నారన్నారు.

.