మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో దాడి.. తొమ్మిది మందిపై కేసు నమోదు

మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో దాడి.. తొమ్మిది మందిపై కేసు నమోదు

దుబ్బాక, వెలుగు: మంత్రాల నెపంతో సిద్దిపేట జిల్లా హబ్షీపూర్​లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. హబ్షీపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి నర్సయ్య(45) మంత్రాలు చేస్తున్నాడని అనుమానించిన నర్సగల్ల మహిపాల్, నర్సగల్ల మైషయ్య, నర్సగల్ల ఎల్లం, నర్సగల్ల భూదయ్య, జోగు పోచయ్య, మల్లి బాబు, ఏర్పుల శ్యామ్, మల్లి స్వామి, ఏర్పుల పోచయ్య ఈ నెల 17న కుల సంఘంలోకి పిలిచారు. 

నర్సయ్య మంత్రాలతో తమ కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని రాళ్లు, కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. నర్సయ్య కొడుకు పర్శరాములు ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిని శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు.