ఎన్నికల ఫలితాలపై నేషనల్ మీడియా ఫోకస్

ఎన్నికల ఫలితాలపై నేషనల్ మీడియా ఫోకస్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. ఎగ్జిట్ పోల్స్‌‌లో కాంగ్రెస్ పార్టీకే అధికారం ఖాయమని తేలడంతో.. ప్రభుత్వ మీడియా సంస్థ దూరదర్శన్ సహా జాతీయ మీడియా సంస్థలు కౌంటింగ్ సరళిపై దృష్టి సారించాయి. జాతీయ స్థాయి లీడర్లూ తెలంగాణలోనే ఉండటంతో ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడ మోహరించారు. 

ప్రైవేట్ మీడియా సంస్థలకు దీటుగా దూరదర్శన్ కూడా ఫలితాలపై మినిట్ టు మినిట్ కవరేజీని ఇవ్వనుంది. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆఫీసుల వద్ద డీడీ న్యూస్ ఓబీ వ్యాన్లను టెలికాస్ట్ కోసం సిద్ధంగా ఉంచింది.