
కోలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తొచ్చే మొదటి జంట.. ‘నయన్-విఘ్నేశ్’లది. హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ (2022 జూన్ 9న) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేడు (జూన్ 9న) ఈ జంట తమ మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయనతార పలు ఫోటోలు షేర్ చేస్తూ.. తన భర్త విగ్నేష్పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది.
‘‘మీరెప్పుడు ఆశ్చర్యపోవచ్చు.. ఎవరు మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తారో! మీకెప్పటికీ ఈ విషయంలో సమాధానం దొరకకపోవొచ్చు. నీ ప్రేమను ఎలా వర్ణించాలో నాకు తెలియదు.. నా మనసు కోరుకునేదంతా నిన్ను.. నీ ప్రేమనే.
ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. నిన్ను ప్రతిక్షణం ప్రేమిస్తుంటాను’’అని పొయెట్రీక్ నోట్తో పాటు, వరుస రొమాంటిక్ ఫోటోలు నయన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నయన్-విఘ్నేశ్లకు తమ ఫ్యాన్స్, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
విఘ్నేశ్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది నయన్. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.
♥️ #WikkiNayan 😇 pic.twitter.com/Hp3a5VX56M
— Nayanthara✨ (@NayantharaU) May 29, 2025
నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ది టెస్ట్(The Test) అనే సినిమా చేసింది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ‘మూకుతి అమ్మన్ 2’. ఇది తమిళ భాషా ఫాంటసీ కామెడీ. వీటితో పాటు అనిల్ రావిపూడి, చిరు మెగా 157లో హీరోయిన్ గా నటిస్తోంది.