నయనతార.. దీపిక మధ్య గొడవలు ఉన్నాయా.. అందుకేనా బాలీవుడ్ కు దూరం

నయనతార.. దీపిక మధ్య గొడవలు ఉన్నాయా.. అందుకేనా బాలీవుడ్ కు దూరం

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) డ్యూయల్ రోల్లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో..నయనతార(Nayanthara), దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ..సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

లేటెస్ట్గా జవాన్ లో నటించిన హీరోయిన్స్ నయనతార..దీపిక మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జవాన్ మూవీ ప్రమోషన్స్లో గానీ, సక్సెస్ ఈవెంట్స్లో గానీ ఎక్కడ నయనతార పాల్గోనలేదు. అందుకు కారణం ఏమై ఉంటుందనే ఫ్యాన్స్ ఆరాతీస్తుండగా..కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

జవాన్ మూవీలో నయనతార మెయిన్ హీరోయిన్గా నటించగా..దీపికా కేవలం క్యామియో రోల్లో నటించింది. అయినా దీపికా పాత్రకే ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో డైరెక్టర్ అట్లీపై నయనతార చాలా కోపంతో ఉన్నట్లు సమాచారం. ఇక మెయిన్గా జవాన్ మూవీ షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే మూవీలా ఉందని తమ సన్నిహితులు అనుకుంటున్నారని నయనతార అభిప్రాయపడుతుంది.

అందుకు నయనతార బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కొన్నాళ్ల వరకు బాలీవుడ్లో ఎటువంటి మూవీస్ చేయకూడదని డిసైడ్ అయినట్లు టాక్. జవాన్ సక్సెస్ తో కొంత మంది బాలీవుడ్ మేకర్స్ నయనతారకు..స్టోరీస్ వినిపించాడానికి వచ్చిన, కనీసం వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదని వినిపిస్తోంది.ఇక కొంతమంది ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని..నయనతారకు మూవీ ప్రమోషన్స్లో గానీ, ఈవెంట్స్ గానీ వెళ్లే అలవాటు లేకపోవడం వల్ల..జవాన్ సెలెబ్రేషన్స్లో పాల్గొనలేకపోతుందని చెప్తున్నారు. ఇక ఈ విషయాల పైన నయనతార స్పందించే వరకు..అసలు నిజం ఏంటనేది తెలియదు. 

జవాన్ మూవీ ఇప్పటివరకు రూ.1000 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక డైరెక్టర్ అట్లీ నుంచి రాబోయే మూవీస్ పైన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా అట్లీ పేరు కనిపిస్తోంది.ఈ డైరెక్టర్ తన తర్వాతీ ప్రాజెక్ట్ను నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో..రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.