ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఎన్ సీసీ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎన్ సీసీ జేసీవో సుబేదార్ సుభాష్, ప్రకాశ్ సింగ్ చీఫ్ గెస్టులుగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
దేశంలో ఎన్ సీసీ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్ సీసీ అధికారి లెఫ్టినెంట్ కిరణ్ కుమార్, వెంకటేశ్,విద్యాసంస్థల డైరెక్టర్ రత్న కుమారి, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.