ప్రియాంక హత్య.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్

ప్రియాంక హత్య.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్

షాద్ నగర్లో  దారుణ హత్యకు గురై వెటర్నరీ డాక్టర్  ప్రియాంక రెడ్డి హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటగా స్వీకరించిన కమిషన్ సాయంత్రం హైదరబాద్ కు  ఓ టీంను పంపిస్తున్నట్లు తెలిపింది.  ఈ టీం బాధిత కుటుంబానికి అండగా ఉంటూ న్యాయం జరిగేలా చేస్తుందని తెలిపింది.

ప్రియాంక హత్యపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై తోడేళ్లల  అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. వీధుల్లో మనుషులు తిరుగుతున్నట్లు లేదని తోడేళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందన్నారు.  దోషులుగా తేలితే నిందితులను అరెస్ట్ చేసి ఉరితీయాలన్నారు రేఖా శర్మ.