మాతృ మరణాలపై సీరియస్ యాక్షన్ : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ 

మాతృ మరణాలపై సీరియస్ యాక్షన్ : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో ఒక్క బాలింత మరణం సంభవించొద్దని, ఇందుకు డాక్టర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​అంకిత్​ ఆదేశించారు. మాతృ మరణాలపై కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతి మాతృ మరణ కేసును సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాలని, మరణానికి దారి తీసిన కారణాలు, గర్బధారణ సమయంలో అందిన వైద్య సేవలు, రిఫరల్​ వ్యవస్థ, అత్యవసర చికిత్స, ట్రాన్స్​పోర్టు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

అంతకుముందు ఎల్వీ ప్రసాద్​ ఐ ఇన్​స్టిట్యూట్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవ జాత శిశువులకు ప్రారంభంలోనే కంటి సమస్యలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్​ వేణుగోపాల్​, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో తుకారాం రాథోడ్​ పాల్గొన్నారు.