- 3 రోజులు పలు అంశాల పరిశీలన
- 13 నుంచి నాగార్జునసాగర్లో మరో టీమ్ పర్యటన
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును మంగళవారం నుంచి గురువారం వరకు నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ సందర్శించనుంది. ఎన్డీఎస్ఏ మెంబర్ వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని టీమ్లో ఎన్డీఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్, కన్సల్టెంట్కమలేశ్జైన్తోపాటు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, సీఎస్ఎంఆర్ఎస్, ఏపీ, తెలంగాణ నుంచి నామినేట్అయిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ బృందం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి లోపాలపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన భారీ వరదలతో స్పిల్వే దిగువన ప్లంజ్పూల్(భారీ గుంత) ఏర్పడింది.
ఆ తర్వాత వచ్చిన వరదలతో దాని తీవ్రత పెరిగింది. కేఆర్ఎంబీ మెంబర్రవికుమార్పిళ్లై నేతృత్వంలోని ఎక్స్పర్ట్టీమ్గతంలోనే శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి ప్లంజ్పూల్ను పూడ్చేయడంతోపాటు ఇతర రిపేర్లు చేపట్టాలని నివేదించింది. ఇందుకు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతాయని తెలిపింది. ప్లంజ్పూల్ను పూడ్చేయకపోతే డ్యామ్ భద్రతకే ప్రమాదమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ టీమ్డ్యామ్ను పరిశీలించి ప్లంజ్పూల్తోపాటు శ్రీశైలం భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్డీఎస్ఏ మెంబర్ రాకేశ్ కష్యప్ నేతృత్వంలోని మరో టీమ్ఈనెల 13 నుంచి 15 వరకు నాగార్జున సాగర్ప్రాజెక్టును పరిశీలించనుంది. ఈ టీమ్లో ఎన్డీఎస్ఏ డైరెక్టర్ ఎం.ఎస్. వర్మ, డిప్యూటీ డైరెక్టర్మహ్మద్జిషాన్, కన్సల్టెంట్ రాకేశ్ గౌరానాతోపాటు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, తెలంగాణ నుంచి నామినేట్ అయిన అధికారులు సభ్యులుగా ఉంటారు. సాగర్స్పిల్వే దెబ్బతినడంతో రూ.20 కోట్లతో తెలంగాణ రిపేర్లు చేయిస్తోంది. ఎన్డీఎస్ఏ టీమ్ఆ పనులతో పాటు రిజర్వాయర్కు సంబంధించిన అన్ని భద్రత అంశాలను పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది.