న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ట్రోఫీ వేటలో హాట్ ఫేవరేట్ గా మారింది. ముఖ్యంగా రైజర్స్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టోర్నీలో హాట్ టాపిక్ గా మారాడు. మెరుపు వేగంతో అతడు విసిరే బంతులకు ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్ బౌలింగ్ చేసిన తీరు అందర్నీ ఫిదా చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వేసిన ఉమ్రాన్.. ఒక్క పరుగూ ఇవ్వకుండా.. నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ పై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ పై ప్రశంసలు కురిపించారు. అతడ్ని టీమిండియాకు సెలెక్ట్ చేయాలన్నారు.
We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalik https://t.co/T7yLb1JapM
— Shashi Tharoor (@ShashiTharoor) April 17, 2022
'ఉమ్రాన్ ను త్వరలో భారత జట్టులో చూడాలని ఉంది. అతడిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. ఇంగ్లండ్ గడ్డపై జరిగే టెస్టు సిరీస్ కు అతడ్ని ఎంపిక చేయాలి. ఉమ్రాన్, బుమ్రా కలసి బౌలింగ్ చేస్తే ఆంగ్లేయులను ఓ ఆటాడించొచ్చు' అని థరూర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి: