సీఎం కేసీఆర్​తో నీలం మధు భేటీ..

సీఎం కేసీఆర్​తో నీలం మధు భేటీ..

పటాన్​చెరు టికెట్​ఆశిస్తున్న బీఆర్ఎస్​ నేత నీలం మధు ముదిరాజ్​ మంగళవారం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యారు. మంత్రి హరీశ్​రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​ ముదిరాజ్​తో కలిసి ఆయన సీఎంను కలిశారు. ఈ సమావేశంలో పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. 

ఈ భేటీ అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​లో ముదిరాజ్​ కులానికి ప్రాధాన్యత పెంచాలని, పటాన్​చెరుతోపాటు మరో స్థానంలోనూ ముదిరాజ్​లకు టికెట్​ఇవ్వాలని కోరానన్నారు. పటాన్​ చెరులో తాను పోటీ చేస్తేనే గెలుస్తానని, ఆ స్థానంలో టికెట్​పై పునరాలోచన చేయాలని  విజ్ఞప్తి చేస్తే  సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ​అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై మాట్లాడుదామని హామీ ఇచ్చారన్నారు.