పటాన్చెరు టికెట్ఆశిస్తున్న బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి హరీశ్రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్తో కలిసి ఆయన సీఎంను కలిశారు. ఈ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
ఈ భేటీ అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో ముదిరాజ్ కులానికి ప్రాధాన్యత పెంచాలని, పటాన్చెరుతోపాటు మరో స్థానంలోనూ ముదిరాజ్లకు టికెట్ఇవ్వాలని కోరానన్నారు. పటాన్ చెరులో తాను పోటీ చేస్తేనే గెలుస్తానని, ఆ స్థానంలో టికెట్పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తే సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై మాట్లాడుదామని హామీ ఇచ్చారన్నారు.