టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్లో భారత్కు మొదటి గోల్డ్ మెడల్ ను అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ASI) కు నీరజ్ పేరు పెట్టారు. ఒలింపిక్స్లో పాల్గొన్న డిఫెన్స్ రంగానికి చెందిన క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొన్నారు.
ఇందులో బాగంగా ఆయన నీరజ్ చోప్రాతో పాటు తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ (ఆర్చరీ), అమిత్, మనీష్ కౌషిక్, సతీష్ కుమార్ (బాక్సింగ్), వారి కోచ్లను సన్మానించారు. చోప్రాకు జావెలిన్ను బహుకరించిన కేంద్ర మంత్రి.. ASI పేరును నీరజ్ చోప్రా స్టేడియంగా మార్చుతున్నట్టు ప్రకటించారు.