
కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షా విధానం నుంచి తమిళనాడు ను మినహాయించాలని తమిళనాడు కు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షా విధానం లోపాలున్నాయి.. ఇటీవల నీట్ పరీక్ష నిర్వహణలో ఇది బయటపడింది.. మాకు నీట్ పరీక్షా విధానం వద్దని తమిళనాడు ఎప్పటినుంచో చెబుతోంది.. ఇప్పుడు దేశం మొత్తం కూడా అదే చెబుతోంది అని సోమవారం (జూన్ 24) ఢిల్లీలో జరిగిన ఎన్ ఎస్ యూఐ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి డిమాండ్ చేశారు.