కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి

కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి

ఎస్‌.ఆర్‌ కళ్యాణ మండపం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం.  ప్రస్తుతం 'రూల్స్ రంజన్' అనే ఓ సినిమాని చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి  రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అవ్వగా, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో కిరణ్ సరసన డి.జే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించనుంది. దీనితో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.