Animal Movie OTT: ఓటీటీలోకి యానిమల్‌..రణ్బీర్ క్రూరమైన ఆవేశాన్ని చూసేయండి: నెట్‌ఫ్లిక్స్‌

Animal Movie OTT: ఓటీటీలోకి యానిమల్‌..రణ్బీర్ క్రూరమైన ఆవేశాన్ని చూసేయండి: నెట్‌ఫ్లిక్స్‌

సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) బాలీవుడ్ లో తెరకెక్కించిన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor),నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థియేటర్స్ లో భీబత్సం స్పృష్టించిన యానిమల్..ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. ఇక ఎలా ఉంటుందో జాగ్రత్త సుమా!

ఇవాళ (జనవరి 26) నుండి యానిమల్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ విభిన్నంగా తెలుపుతూ ట్వీట్ చేసింది..గాలి దట్టంగా ఉంది..ఉష్ణోగ్రత పెరుగుతోంది. జనవరి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న యానిమల్‌లో అతని క్రూరమైన ఆవేశానికి మీరందరూ సాక్ష్యమివ్వండి. అంటూ తెలిపింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

యానిమల్ సినిమాను కేవలం రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి..దాదాపు రూ.900 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన యానిమల్​లో రణ్బీర్​కు జంటగా రష్మిక,త్రిప్తి డిమ్రీ  నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్ర‌లు పోషించారు. మరి థియేటర్స్లో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.