జ్ఞానశేఖర్ నిర్మాణంలో త్వరలో రెండో చిత్రం ప్రారంభం

జ్ఞానశేఖర్ నిర్మాణంలో త్వరలో రెండో చిత్రం ప్రారంభం

గమనం సినిమాతో నిర్మాతగా మారిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్.. త్వరలోనే తన బ్యానర్లో కాళీ ప్రొడక్షన్స్ ద్వారా రెండో సినిమాను ప్రారంభించనున్నారు. ఆ చిత్ర దర్శకురాలు సుజనా రావ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. విమర్శకుల ప్రసంశలు పొంది మంచి చిత్రంగా నిలివగా... జ్ఞానశేఖర్ నిర్మించబోయే నూతన చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. గతంలో దర్శకుడు క్రిష్ తో కలిసి మణికర్ణిక, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు జ్ఞానశేఖర్. కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జవాల్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో ఐబి 71 చిత్రానికి వర్క్ చేస్తున్నారు.  అలాగే తమిళ్ లో జయం రవితో ఒక సినిమా చేస్తున్నారు. ఇలా సెలెక్టెడ్ గా కథ బలం ఉన్న సినిమాలను చేస్తూ వెళుతున్నారు విఎస్.జ్ఞానశేఖర్. అయితే తాజాగా ప్రకటించిన ఈ కొత్త మూవీలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయని సమాచారం.

 

మరిన్ని వార్తల కోసం...

హీరో అశోక్ గల్లాకు కరోనా

సల్మాన్ ఖాన్కు భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం