
హైదరాబాద్, వెలుగు: ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో పర్మిషన్స్ ఇచ్చే టీఎస్ బీపాస్ విధానాన్ని జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని మున్సిపల్కాంప్లెక్స్లో గురువారం మున్సిపల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో టీఎస్బీపాస్(టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)పై మంత్రి కేటీఆర్సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న అప్లికేషన్లను ఆన్లైన్లో పరిశీలిస్తూ పర్మిషన్స్ ఇస్తున్నట్టు ఉన్నతాధికారులు మంత్రికి చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1,100 అప్లికేషన్లు రాగా, వాటిలో కొన్నింటికి పర్మిషన్స్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇందుకు వాడుతున్న సాఫ్ట్వేర్, సపోర్టింగ్సిస్టమ్పై ఫీల్డ్నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని, వచ్చే 15 రోజుల్లో ఇంకా మార్పులుచేసి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. టీఎస్ బీపాస్పై పనిచేసే సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని, దీనిపై ఒకట్రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని కలెక్టర్లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. టీఎస్ బీపాస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే మీసేవ, ఇతర ఇంటర్నెట్ సెంటర్స్, మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్ పెట్టుకునేలా అవకాశం ఇవ్వాలన్నారు. ఇబ్బందులొస్తే సంప్రదించేందుకు కాల్సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.