డ్రగ్స్ మత్తు వదిలిస్తాం: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

డ్రగ్స్  మత్తు వదిలిస్తాం: సీపీగా  బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

సిటీలో శాంతి భద్రత కాపాడటమే మా మొదటి కర్తవ్యం అన్నారు కొత్త సీపీ వీసీ సజ్జనార్​. మంగళవారం ( సెప్టెంబర్​ 30) న హైదరాబాద్​ సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాలో మాట్లాడారు  సజ్జనార్. 

సిటీలో శాంతి భద్రతలు కాపాడటమే మా మొదటి కర్తవ్యం అన్నారు సీపీ సజ్జనార్. డ్రగ్స్​ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్​ మత్తు వదిలిస్తామన్నారు.  

సైబర్​ కేటుగాళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు సీపీ సజ్జనార్. డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు.. ప్రజలు సైబర్​ మోసాగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్​ క్రైం కట్టడికి మరిన్న చర్యలు చేపట్టనున్నట్లు సీపీ  చెప్పారు. 

ఆన్​ లైన్​ బెట్టింగ్, ఫేక్​ యాప్​ పై నిఘా పెంచుతామన్నారు సీపీ. సిటీలో మహిళ భద్రతకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తామన్నారు.  డ్యూటీలో పోలీసులు మరింత అలెర్ట్​ గా ఉండాలని ఆదేశించారు హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషనర్​ వీసీ సజ్జనార్​.